Friday, May 13, 2022

అనారోగ్యం వల్ల కలిగే అనుగ్రహాలు

మిత్రమా! జబ్బు ఓ చెడ్డ . వస్తువు అయివుంటే అల్లాహ్ తాను మెచ్చిన దాసులను అనారోగ్యానికి గురిచేసేవాడు కాదు. నువ్వూ-నేనే కాదు, పెద్ద పెద్ద ప్రవక్తలు కూడా రోగ బారిన పడ్డారు. దైవప్రవక్త అయ్యూబ్ (అలైహిస్సలాం) భరించరాని బాధకి లోను చేయబడ్డారన్న సంగతి నీకు తెలుసు. ఇక్కడ గమనించదగిన ఓ ముఖ్య విషయముంది. కొన్ని రోగాలు మనిషిని అత్యున్నత స్థాయికి చేరుస్తాయి. అల్లాహ్ మార్గంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారికి లభించేంత పుణ్యం లభిస్తుంది. ఉదాహరణకు: - పురిటి నొప్పులతో ప్రాణం వదిలే స్త్రీ మూర్తి, జల ప్రవాహంలో మునిగి మరణించేవారు, అగ్ని ప్రమాదంలో మృత్యు చెందేవారు, (ఆత్మ హత్యలు కావు సుమా) ప్లేగు తరహా వ్యాధితో మరణించేవారు. అల్లాహ్ ప్రియుల్లో చేరతారని ప్రవక్త(స) ఉద్ఘాటించారు. 



 ప్రేమ - అనురాగం

జబ్బు మనిషికి, సమాజంలో వున్న ప్రముఖ వ్యక్తుల పట్ల, బంధుమిత్రుల పట్ల ప్రేమానురాగాలను, గౌరవ మర్యాదలను నేర్పుతుంది. తను సంఘజీవి అనీ, ఇతరుల అవసరం ఎంతయినా తనకుందనీ, జీవితమనే ఈ రణరంగంలో ఒంటరి పోరాటం అసాధ్యమని తెలియపరుస్తుంది. మరి జనుల అవసరం తనకు లేదని భావించే వ్యక్తి జీవితం గర్వం, అహంకారం, అహంభావాలతో నిండి వుంటుంది. తత్ఫలితంగా మనిషి సాటి మనుషులని అర్ధం చేసుకోవటంగాని, పిల్లలతో మృదువుగా మాట్లాడటంగాని చెయ్యడు. దైవ వచనం ఈ విషయాన్నే సూచిస్తుంది. మానవుడు తనను తాను ఎవరి అక్కరా లేనివాడననీ, స్వతంత్రుడననీ మితిమీరి ప్రవర్తిస్తూ వుంటాడు. (అలఖ్ -  6,7) 


మారుతున్న మనస్తత్వం

నేటి పిల్లలు మధ్యతరగతి లేదా పేద కుటుంబంలో పుట్టవచ్చు, కానీ వారి ఆలోచన చాలా హై-ఫై. వీరి కలలు చాలా రిచ్ గా ఉంటాయి. దీని వల్ల పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు. పిల్లలు కష్టపడి పనిచేసే తల్లిదండ్రులను కార్మికులుగా పరిగణించడం ప్రారంభిస్తారు. వారు పెద్దయ్యాక కొన్నిసార్లు వారిని సేవకులుగా చేసి, వారి ఇంటి పనులన్నింటినీ పూర్తి చేస్తారు. 

తల్లి పాదాల క్రింద (తల్లి సేవలో) స్వర్గముంది, తండ్రి స్వర్గానికి తలుపు లాంటివాడు అన్న దైవప్రవక్త(స) గారి హితబోధని తు.చ తప్పకుండా పాటిస్తూ స్వర్గాన్ని తన సొంతం చేసుకోవటానికి బదులు తన జన్మకు కారకురాలైనవారిని అగౌరవ పరచి మనిషి తన చేజేతులా ఇహపరాల జీవితాల మరణ శాసనం రాసుకుంటున్నాడు. ఇలాంటివారు ప్రవక్త ముహమ్మద్ (స) గారి ఈ హదీసును కాస్త గమనిస్తే చాలా మంచిది: “తీర్పు దినాన సార్వభౌమాధికారి అయిన అల్లాహ్ మనిషిని ఉద్దేశించి ఇలా అంటాడు: ఓ ఆదం పుత్రుడా నేను రోగిగా వున్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించడానికి వచ్చావా? అని. ' ఓ నా ప్రభూ! నువ్వు సర్వలోక ఆరోగ్య ప్రదాతవి కదా. (దాసుదయిన) నేను (ప్రభువయిన) నిన్ను పరామర్శించడం ఏమిటి?' అని దాసుడు విన్నవించుకుంటాడు. అల్లాహ్ ఇలా అంటాడు: " నా ఫలానా దాసుడు రోగగ్రస్థుడయివున్నప్పుడు నువ్వు అతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు కదా! అలా నువ్వు వెళ్ళి అతన్ని ఓదార్చి వుంటే నన్ను అక్కడ పొంది ఉండే వాడివి. (నా కరుణా కటాక్షా లకు అర్హుడయ్యేవాడివి) ( ముస్లిం)


ఆఖరి మాట అంతిమ ప్రవక్త(స) నోట

(అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో)

* మీపై సుఖశాంతులు కురియుగాక! సర్వలోక ప్రభువయిన అల్లాహ్ ను స్తుతిస్తూ, ఆయనకు నా కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. అల్లాహ్ తప్ప ఆరాధనకి అర్హులైన వారు ఎవ్వరూ లేరు. కనుక మీరు సయితం అల్లాహ్ ను స్తుతిస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోండి. అల్లాహ్ మీకు గొప్ప ఫలితాన్ని ఇవ్వుగాక! మీకు సహన స్థయిర్యాలు ప్రసాదించుగాక! మనందరినీ కృతజ్ఞుల్ని చేయుగాక. మన ధన ప్రాణాలు ఆస్తిపాస్తులు, ఆలుబిడ్డలు, బంధు మిత్రులు - ఇవన్నీ అల్లాహ్ ప్రసాదించిన దైవానుగ్రహాలే. ఇవన్నీ మనకు అప్పగించబడిన అల్లాహ్ అమానతులు. ఇవి మీ దగ్గర వున్నంత వరకు అల్లాహ్ మీకు సుఖసౌఖ్యాలు ప్రసాదించుగాక! అవి దూరమయిన తరువాత అల్లాహ్ మీకు మంచి సత్ఫలితాన్ని ప్రసాదించుగాక, పరలోకాన్ని కాంక్షిస్తూ సహనం వహించే మీపై అల్లాహ్ తన కారుణ్య వర్షాన్ని కురిపించి సన్మార్గంపై మీకు నిలకడను ప్రసాదించుగాక, సహనం వహించండి.

 చూడండి! మీ కలత చెందడాలు. (ఆశా జ్యోతిని ఆర్పివేసే) నిరాశా నిస్పృహలు బహుశా మీకు పుణ్యం లభించకుండా చెయ్యవచ్చునేమో! తరువాత పశ్చాత్తాపం చెందేది కూడా మీరే. మీ ఈ అసహనం వల్ల మరణించే వ్యక్తి తిరిగి రాడు. దు:ఖం నుండి విముక్తి లభించదు. ఏది, ఎప్పుడు జరగాలో అది జరిగే తీరుతుంది. వస్సలామ్. " ( ముఅజముల్ కబీర్ - తబ్రానీ  )

(హజ్రత్ మాబ్-ఇన్-జబల్(ర) గారు పుత్ర వియోగంతో ధుఃఖిస్తూ  వున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్(స) ఆయన్ను ఓదార్చుతూ వ్రాసిన లేఖ ఇది).


No comments:

Post a Comment